News June 8, 2024
HYD: రామోజీరావు మరణంపై మధుయాష్కి గౌడ్ సంతాపం
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, HYD ఎల్బీనగర్ నియోజకవర్గ నేత మధుయాష్కి గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పత్రికా, మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, జర్నలిజంలో నూతన ఒరవడికి బాటలు వేసి.. అందరూ అనుసరించేలా మార్గదర్శి అయ్యారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
Similar News
News September 22, 2024
28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News September 22, 2024
HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్
గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
News September 22, 2024
RRR సౌత్ అలైన్మెంట్ ఖరారుకు ప్రత్యేక కమిటీ
HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.