News May 12, 2024

HYD: రాష్ట్రంలోనే అత్యధిక మంది పోటీ చేసేది ఇక్కడే!

image

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా ఈవీఎం యంత్రాలను వినియోగించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఒక్కో EVM యంత్రంలో నోటా, 15 మంది అభ్యర్థులను మాత్రమే అమర్చగలిగే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News November 7, 2025

HYD: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCM ఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.

News November 7, 2025

జూబ్లిహిల్స్ బైపోల్స్: సమయం లేదు మిత్రమా.. !

image

ప్రచారానికి గడవు ఈరోజుతోపాటు ఉన్నది మూడు రోజులే.. అంతే.. అదీ ఆదివారం సాయంత్రానికి క్లోజ్.. అందుకే నాయకులు నిద్రపోవడం లేదు. రాత్రి వరకు ప్రచారం చేసి రాత్రి వేళ స్థానిక నాయకులతో మంతనాలు.. ఏ ఓటు ఎవరికి వచ్చే అవకాశం.. మనకెన్ని ఓట్లు వస్తాయనే విషయంపైనే సమాలోచనలు.. ఓటు మనకు రాకపోతే ఎలా రాబట్టుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ మూడు రోజులను పక్కాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

image

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్‌‌లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.