News November 5, 2024

HYD: రాహుల్ గాంధీ బావర్చీకి రావాలని డిమాండ్

image

HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్, అశోక్‌నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్‌‌లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Similar News

News October 14, 2025

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News October 12, 2025

RR: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

image

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News October 11, 2025

సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.