News March 4, 2025

HYD రియల్ ఎస్టేట్‌లో 45% వాటా మనదే..!

image

HYDలో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అత్యధిక రిజిస్ట్రేషన్లతో మేడ్చల్ జిల్లా వాటా 45%గా ఉందని సగటు చదరపు అడుగు ధర రూ.3494గా రికార్డయిందని, రంగారెడ్డి జిల్లాలో 41% రిజిస్ట్రేషన్లు జరిగాయని సగటు చదరపు ధర రూ.4713 నమోదయందని HYD జిల్లా వాటా 14%గా ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్ సంస్థ తెలిపింది.

Similar News

News October 21, 2025

సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

News October 21, 2025

ఆపరేషన్ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి: మోదీ

image

దీపావళి వేళ దేశ ప్రజలకు PM మోదీ లేఖ రాశారు. ‘అయోధ్యలో రామమందిరం నిర్మించాక ఇది రెండో దీపావళి. ఈసారి చాలా ప్రత్యేకం. శ్రీరాముడు మనకు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, నీతి నేర్పాడు. కొన్ని నెలల క్రితం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ ఇందుకు నిదర్శనం. నక్సలిజాన్ని నిర్మూలించిన ప్రాంతాల్లోనూ దీపాలు వెలిగాయి. ఇటీవల ఎంతోమంది హింసను వదిలి రాజ్యాంగంపై విశ్వాసంతో అభివృద్ధిలో భాగమవుతున్నారు’ అని పేర్కొన్నారు.

News October 21, 2025

ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

image

NLG: నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ చౌరస్తా వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.