News October 6, 2024

HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం

image

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

image

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరుతున్నామన్నారు.

News November 18, 2025

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

image

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరుతున్నామన్నారు.

News November 18, 2025

హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

image

హైదరాబాద్‌ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్‌పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్‌పురా, అసిఫ్‌నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్‌పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.