News January 2, 2025
HYD: రూ.3,805 కోట్ల మద్యం తాగేశారు..!

హైదరాబాద్లో డిసెంబర్ 30, 31న వైన్స్ వద్ద మద్యం ప్రియులు భారీ క్యూ లైన్లలో నిలుచుని ఉండగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 31 మధ్య రూ.1700 కోట్ల ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు అధికమని తెలిపింది. అధికంగా డిసెంబర్ 30న రూ.402 కోట్లు, 31న రూ.282 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది.
Similar News
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT


