News August 12, 2024

HYD: రూ.3,849 కోట్లతో.. 39 మురుగు శుద్ధి ప్లాంట్లు

image

HYDలో ఇక మురుగు శుద్ధి 100% జరగనుందని అధికారులు చెబుతున్నారు. రూ.3,849 కోట్లతో 39 సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమృత 2.0 ట్రాంచి -3 ప్రోగ్రాంలో భాగంగా నిర్మించనున్నారు. మొత్తం వీటిని 2 ప్యాకేజీలలో పూర్తి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో 16, రెండో ప్యాకేజీలు 22 పూర్తి కానుండగా.. వీటితో 972 MLD మురుగునీరు శుద్ధి కానుంది.

Similar News

News November 28, 2025

సనత్‌నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

image

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 28, 2025

HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

image

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.