News May 11, 2024

HYD: రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

image

HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్‌ సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌పీ సింగ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్‌పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Similar News

News November 16, 2025

HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష .

image

డిసెంబర్ 8- 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఫ్యూచర్ సిటీ, ముచ్చర్లలో భారీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేయనున్నారు. 2035నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై దృష్టి పెట్టామని, 70 థీమాటిక్ స్టాల్స్ తెలంగాణ అభివృద్ధి ప్రతిరూపమన్నారు.

News November 16, 2025

HYD: స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

image

స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్‌లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT

News November 16, 2025

జూబ్లీహిల్స్ గెలుపు‌తో ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్: చనగాని

image

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్ లాంటిదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీ‌భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రానున్న రోజుల్లో యువతకు అధిష్ఠానం పెద్దపీట వేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల నమ్మకం పెరిగింది. 75 ఏళ్ల రాష్ట్రంలో ఉద్యమకారుల పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో ఉంటారు. కేటీఆర్ డ్రామా, డీజే ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు’ అని పేర్కొన్నారు.