News September 7, 2024
HYD: రెండు దశల్లో కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం
భారీ ఆక్రమణలతో కునారిల్లిన రాజధానిలోని నాలా వ్యవస్థను గాడిలో పెట్టాలని కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాచరణ రూపొందించింది. రెండు దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా శుక్రవారం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వంద మంది అధికారులు, సిబ్బంది పరిశీలన మొదలు పెట్టారు. నాలాలపై వరదకు అడ్డుపడుతున్న భవనాలను గుర్తించనున్నారు. అనంతరం 2 దశల్లో వాటిని కూల్చివేయనున్నారు.
Similar News
News September 29, 2024
HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి
మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.
News September 29, 2024
HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!
HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
News September 29, 2024
సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్
సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.