News March 2, 2025
HYD: రేపటి నుంచి మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

మెట్రో గ్రీన్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రేపటి నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగంపల్లి – మెహిదీపట్నం రూట్లో ప్రతిరోజు 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయని, లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6:50 గం.లకు బయలుదేరుతుందన్నారు. చివరి బస్సు రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. మెహదీపట్నం నుంచి మొదటి బస్సు ఉ.8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు బయలుదేరనుందన్నారు.
Similar News
News November 7, 2025
HYD: వీళ్లేం సెలబ్రెటీలు: సీపీ సజ్జనార్

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని రైనా, ధవన్ను ఉద్దేశించి Xలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్కు వ్యసనపరులై వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడటానికి వీరు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. ‘సమాజం, యువత మేలు కోసం నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతేకానీ అభిమానులను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
News November 7, 2025
విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.


