News March 2, 2025
HYD: రేపటి నుంచి మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

మెట్రో గ్రీన్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రేపటి నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగంపల్లి – మెహిదీపట్నం రూట్లో ప్రతిరోజు 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయని, లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6:50 గం.లకు బయలుదేరుతుందన్నారు. చివరి బస్సు రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. మెహదీపట్నం నుంచి మొదటి బస్సు ఉ.8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు బయలుదేరనుందన్నారు.
Similar News
News March 16, 2025
భూపాలపల్లి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

భూపాలపల్లి జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం కొంతమేరకు ఉంది. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, మరికొందరు చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.210 ఉండగా.. స్కిన్లెస్ రూ.230గా ఉంది. హోల్సేల్ రూ.80-90 ఉండగా.. రిటైల్ రూ.130 వరకు పలుకుతోంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
News March 16, 2025
అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.
News March 16, 2025
ములుగు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ములుగు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఇంకా వీడలేదు. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.220 ఉండగా.. స్కిన్లెస్ రూ. 240గా ఉంది. హోల్సేల్ రూ.80-90 ఉండగా, రిటైల్ 130 వరకు ధర పలుకుతుంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.