News January 10, 2025
HYD: రేపటి నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్
20 కోచుల సామర్థ్యం కలిగిన ఆరెంజ్ వందే భారత్ రైలు రేపు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు వివిధ ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ పూర్తి చేసినట్లుగా తెలిపారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్, విశాఖపట్నం, పూనే మార్గాల్లోనూ వందే భారత్ రైల్వే సేవలు అందిస్తున్నారు.
Similar News
News January 14, 2025
HYD: అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం: హరీశ్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్ని, టెర్రరిస్ట్ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
News January 14, 2025
రంగారెడ్డి జిల్లాలో నమోదు అవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాచులూరు, ఎలిమినేడులో 13.1℃, రెడ్డిపల్లె 13.3, మీర్ఖాన్పేట 13.5, చందనవెల్లి 13.6, తాళ్లపల్లి, అమీర్పేట, మంగళపల్లె 13.7, వైట్గోల్డ్ SS, కేతిరెడ్డిపల్లి 13.9, కందువాడ 14, షాబాద్ 14.3, రాజేంద్రనగర్, గునగల్ 14.4, కొత్తూరు 14.5, ప్రొద్దుటూరు, యాచారం, తొమ్మిదిరేకుల, ఆరుట్ల 14.6, కాసులాబాద్, నందిగామలో 14.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 14, 2025
HYD: బస్ స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!
HYDలోని గచ్చిబౌలి, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికీ పలువురు గ్రామాలకు వెళ్తున్నారు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొంత మంది నేడు ఉదయం ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్ స్టేషన్లలో కొద్దిమేర రద్దీ నొలకొంది. నేడు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలులో ఉండదని అధికారులు తెలిపారు. సాధారణంగా ఉండే బస్సుల్లోనే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.