News February 18, 2025
HYD: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News October 16, 2025
పర్యాటకులకు కలెక్టర్ సూచనలు

బాపట్ల, చీరాల, రామాపురం బీచ్లలో పర్యాటకుల భద్రతకు కలెక్టర్ వినోద్కుమార్ సూచనలు జారీ చేశారు. ఇటీవల రామాపురం బీచ్లో ఐదుగురు మృతి చెందడంతో బుధవారం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం తనిఖీలకు బ్రీత్ ఎనలైజర్లు, మైకుల ద్వారా హెచ్చరికలు, ఆడియో, వీడియోల ద్వారా అవగాహన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిసార్టు యాజమాన్యాల భద్రతపై చైతన్యం కల్పించాలని సూచించారు.
News October 16, 2025
T20 WCకు అర్హత సాధించిన నేపాల్, ఒమన్

భారత్-శ్రీలంకలో జరిగే 2026 టీ20 ప్రపంచకప్కు ఇప్పటివరకు 19 దేశాలు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నేపాల్, ఒమన్ తమ బెర్తులు ఖరారు చేసుకోగా మరో స్లాట్ ఖాళీగా ఉంది. దాన్ని UAE సొంతం చేసుకునే అవకాశం ఉంది.
జట్లు: భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, USA, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్.
News October 16, 2025
NRPT: ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన అదనపు, ట్రైనీ కలెక్టర్లు

నారాయణపేట ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినీత్ను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామం, కుటుంబ నేపథ్యం ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.