News February 18, 2025
HYD: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News March 17, 2025
పాపం బామ్మ! రూ.20కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ముంబైలో 86ఏళ్ల బామ్మ డిజిటల్ అరెస్టు బాధితురాలిగా మారారు. 2024 DEC 26 నుంచి MAR 3 వరకు ఏకంగా రూ.20.25 కోట్లు మోసపోయారు. ఆధార్, వ్యక్తిగత సమాచారంతో వేరెవరో బ్యాంకు A/C తెరిచి చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ఈ కేసులో కుమార్తెనూ అరెస్టు చేస్తామని బెదిరించారు. సాయపడాలని కోరడంతో డబ్బు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 17, 2025
శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్లో 129 మంది, ధర్మవరం డివిజన్లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
News March 17, 2025
సంగారెడ్డి: మొదటి సంవత్సరం పరీక్షకు 96.71% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.71% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.19,938 మంది విద్యార్థులకు గాను 19,282 మంది విద్యార్థులు హాజరయ్యారని, 656 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.