News March 23, 2024

HYD: రేషన్ అక్రమాలకు జైలు ఖాయం: మాచన  

image

ప్రజా పంపిణీలో అక్రమాలకు పాల్పడి, మోసం చేయడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శేరిలింగంపల్లి తారానగర్ చౌక దుకాణంలో జరిగిన అవకతవకల దృష్ట్యా చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొందరు డీలర్లు రేషన్ దుకాణాలను ఇష్టారాజ్యం నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

Similar News

News October 19, 2025

హైదరాబాద్‌: పిల్లల్లో పెరుగుతున్న అలర్జీలు

image

HYDలో పిల్లల్లో అలర్జీలు అధికంగా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమంది పిల్లల్లో సుమారు ఆరుగురికి అలర్జిక్ రైనైటిస్ (తుమ్ములు, ముక్కు కారటం), బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు) వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ​ఇంట్లో, బయట ఉండే వాతావరణ మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News October 19, 2025

RR: భారీగా తగ్గిన అప్లికేషన్స్.. గడుపు పొడిగింపు

image

వైన్స్ టెండర్ల గడువు ఈనెల 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు సుమారు 13,300పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సరూర్‌నగర్ డివిజన్‌లో 138 వైన్స్ షాపులకు 7,000, శంషాబాద్ డివిజన్‌లో 111 షాపులకు 6,300లకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ.4.32 కోట్ల ఆదాయం సమకూరింది.

News October 19, 2025

నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

image

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.