News January 20, 2025
HYD: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ

రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేసింది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో కమిటీ వేశారు. 2 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2 వారాల అధ్యయనం తర్వాత నివేదిక రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 13, 2025
మరో అరగంటలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ!

హైదరాబాద్లో మెస్సీ మేనియా నడుస్తోంది. మరో అరగంటలో ఆయన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది ఫుడ్ బాల్ క్రీడాకారులు, అభిమానులు పాస్లు తీసుకొని స్టేడియానికి పోటెత్తారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కొందరేమో మెస్సీకి అభివాదం చెప్పేందుకు స్టేడియం బయట బారులు తీరారు.
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్..NOT ALLOWED

ఉప్పల్లో నేడు జరగనున్న “మెస్సీ” గోట్ ఇండియా టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కెమెరాలు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, సిగరెట్లు, లైటర్లు, ఆయుధాలు, నీటి సీసాలు, మద్యం, ఆహారం, బ్యాగులు, ల్యాప్టాప్లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్లు, బైనాక్యులర్లు, పటాకులు, మత్తు పదార్థాల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు.
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్నుమా

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో బస ఏర్పాటు చేసింది. ఫలక్నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్ను లీజ్ తీసుకుంది.


