News September 6, 2024
HYD: రైతు సురేందర్ రెడ్డికి హరీశ్రావు నివాళి

మేడ్చల్లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
Similar News
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
News November 20, 2025
HYDలో పక్షులు చూద్దామన్నా.. కనిపించట్లేదు!

HYD నుంచి ORR పరిసరాల్లో గతంలో అనేక రకాల పక్షులు కనపడేవి. అయితే ఇటీవల వలస పక్షుల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. మారుతున్న వాతావరణం, వేగంగా పెరుగుతున్న పట్టణీరీకరణ, జలవనరుల తగ్గుదల, చెరువులు, కుంటలు తగ్గటం వంటి కారణాలు పక్షుల నివాసాలను ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడకపోతే జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


