News March 4, 2025
HYD: రోజుకు నలుగురు మృతి.. ఇదీ పరిస్థితి..!

HYD మహా నగరంలో 24 గంటలకు నలుగురు మరణిస్తున్నారు. గతేడాది HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,000 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో బైకర్స్ అధికంగా మృత్యువాతపడ్డారు. అందులోనూ మద్యం తాగి మృత్యువాత పడ్డవారే. మద్యం తాగి బండ్లు నడపొద్దని పోలీసులు నిత్యం క్యాంపెయిన్ నిర్వహిస్తూనే ఉంటారు. గతేడాది 22 లక్షల చలాన్లు జారీ కాగా.. రూ.111 కోట్లు జరిమానా విధించారు.
Similar News
News December 4, 2025
అన్నమయ్య: రైలు పట్టాలపై యువకుల మృతి

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. సెంట్రల్ ట్రాక్పై కూర్చొని మద్యం తాగుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో చనిపోయారని సమాచారం.
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


