News March 4, 2025
HYD: రోజుకు నలుగురు మృతి.. ఇదీ పరిస్థితి..!

HYD మహా నగరంలో 24 గంటలకు నలుగురు మరణిస్తున్నారు. గతేడాది HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,000 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో బైకర్స్ అధికంగా మృత్యువాతపడ్డారు. అందులోనూ మద్యం తాగి మృత్యువాత పడ్డవారే. మద్యం తాగి బండ్లు నడపొద్దని పోలీసులు నిత్యం క్యాంపెయిన్ నిర్వహిస్తూనే ఉంటారు. గతేడాది 22 లక్షల చలాన్లు జారీ కాగా.. రూ.111 కోట్లు జరిమానా విధించారు.
Similar News
News March 19, 2025
హిందూపురం వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 19, 2025
పెద్దపల్లి: ఈ- హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్పై అవగాహన సదస్సు

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డేటా ఎంట్రీ చేయుటకు డిజిగ్నేటెడ్ చేయబడిన సిబ్బందికి eHMIS(ఈ – హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పైన శిక్షణ ఇచ్చారు. రోగుల వివరాలు డిజిటలైజేషన్ చేయడానికి ఈ పోర్టల్ ఏర్పాటు చేశారని తెలిపారు.
News March 19, 2025
IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?