News December 6, 2024
HYD: ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’

HYD, RR, MDCL,VKB జిల్లాలలో పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి ఇటీవలే పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో అవినీతిని నిర్మూలించేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్నారు. ACB పోస్టర్ ఆవిష్కరించిన అధికారులు, ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’ అని పిలుపునిచ్చారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.
Similar News
News September 16, 2025
డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
News September 16, 2025
MIM- జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిహార్ ఎన్నికలకు లింక్

బిహార్ ఎన్నికలకు, జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు అధికారికంగా లింకు లేకపోయినా MIM మాత్రం లింక్ పెడుతోంది. బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి హాఘట్ బంధన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అందులో MIM చేరితే ఇక్కడ ఆ పార్టీ పోటీలో ఉండకకపోవచ్చు. ఒకవేళ కూటమిలో చేరకపోతే MIM కచ్చితంగా పోటీచేస్తుంది. ఇదీ MIM అధినేత ఆలోచన అని సమాచారం. ఈ పొలిటికల్ ఈక్వేషన్ క్లారిటీ కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.
News September 16, 2025
మహానగరంలో ఇవీ మా సమస్యలు

గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని 219 మంది వినతిపత్రాలు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 68 వివిధ సమస్యలపై ఫిర్యాదుచేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోఉన్న ఆరు జోన్లలో 151 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్పల్లిజోన్లో 55, సికింద్రాబాద్ 33, శేరిలింగంపల్లి 30, ఎల్బీనగర్ 15, చార్మినార్ 11, ఖైరతాబాద్ 7 ఫిర్యాదులు వచ్చాయని GHMC అధికారులు తెలిపారు.