News February 20, 2025

HYD: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

image

మాసబ్‌ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా అధికారులకు పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

image

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail)  ఓట్లను లెక్కిస్తారు.

News November 14, 2025

జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌‌కు 47 ఓట్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్‌లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.