News January 8, 2025
HYD: లవర్స్ సజీవదహనం (UPDATE)
ఘట్కేసర్ PS పరిధి ORR సర్వీస్ రోడ్డుపై కారు దగ్ధం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు శ్రీరామ్(25) ఫోన్ నుంచి అమ్మాయి(17) వాట్సాప్లో లైవ్ లొకేషన్తో పాటు 3 పేజీల లెటర్ను ఆమె తండ్రికి సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందే అన్నోజిగూడలోని ఓ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. బాలిక తండ్రి వారున్న లొకేషన్ వెళ్లేసరికి కూతురు, శ్రీరామ్ మంటల్లో <<15087962>>సజీవదహనమయ్యారు<<>>.
Similar News
News January 26, 2025
HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్
దావోస్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు
గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.
News January 26, 2025
కాలీ మాత మందిరం వార్షికోత్సవంలో గవర్నర్
HYD బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాలీ మాత మందిరం ఐదో వార్షికోత్సవం శంషాబాద్లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గవర్నర్ మందిరంలో కాలి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం కమిటీ ప్రతినిధులు ఆయనకు మెమోంటోను ప్రదానం చేశారు.