News December 24, 2024
HYD: లేఖ పేరుతో BRS కపట ప్రేమ: మంత్రి

గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామంటే బీఆర్ఎస్ నాయకులు నాటకాలకు తెరతీస్తున్నారన్నారు. మాయ మాటలతో మరోసారి రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35% కేటాయించమన్నారు.
Similar News
News February 24, 2026
DANGER: HYDలో విష జ్వరాలు!

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.
News February 24, 2026
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు స్థలాల కేటాయింపు

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.
News February 24, 2026
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు స్థలాల కేటాయింపు

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.


