News December 24, 2024
HYD: లేఖ పేరుతో BRS కపట ప్రేమ: మంత్రి

గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామంటే బీఆర్ఎస్ నాయకులు నాటకాలకు తెరతీస్తున్నారన్నారు. మాయ మాటలతో మరోసారి రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35% కేటాయించమన్నారు.
Similar News
News December 1, 2025
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్బాల్ స్టేడియాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
News December 1, 2025
HYD: ఆన్లైన్ బెట్టింగ్.. మరో యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్కు చెందిన సాయి (24) శాంతినగర్లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.
News November 30, 2025
హైకోర్టు: 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర జుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్ధతిలో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సివిల్ జడ్జిల పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను హై-కోర్టు వెబ్సైట్ http://tshc.gov.comని సంప్రదించవచ్చు.
SHARE IT


