News December 24, 2024

HYD: లేఖ పేరుతో BRS కపట ప్రేమ: మంత్రి

image

గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామంటే బీఆర్ఎస్ ​నాయకులు నాటకాలకు తెరతీస్తున్నారన్నారు. మాయ మాటలతో మరోసారి రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35% కేటాయించమన్నారు.

Similar News

News January 19, 2025

HYD: OYO బంద్ చేయాలని డిమాండ్

image

OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News January 18, 2025

ఉప్పల్‌లో బస్సు కింద పడి మృతి (UPDATE)

image

ఉప్పల్ డిపోనకు చెందిన RTC బస్సు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటనసాయంత్రం జరిగింది. పూర్తి వివరాలు.. ఉప్పల్ బస్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (TSU9Z 0280) నల్ల చెరువు మీదుగా వెళ్తోంది. కట్ట మీద ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా వెనుక టైర్ కింద పడ్డాడు. చక్రాలు అతని పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. అతను ఎవరు? ఎందుకు బస్సు కింద పడి చనిపోయాడో వివరాలు తెలియాల్సి ఉంది.

News January 18, 2025

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ విచారణ

image

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.