News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Similar News
News November 16, 2025
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:50కి విమానాశ్రయం చేరుకుని, 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10:20కి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి కోయంబత్తూర్కు బయలుదేరనున్నట్లు పీఎంవో తెలిపింది.
News November 16, 2025
200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 16, 2025
కొనుగోలు కేంద్రాల్లో 4983 మెట్రిక్ టన్నుల ధాన్యం: కలెక్టర్

జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాకు నేటి వరకు 4983.920 మెట్రిక్ టన్నులధాన్యం చేరుకున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17%తేమతో 2263.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2151.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశామని, 112.360 మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.1.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.


