News February 15, 2025
HYD: వాటిని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి: డీజీ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డీజీ డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.
Similar News
News March 12, 2025
HYD: విద్యాశాఖ చివరి నుంచి పోటీపడే పరిస్థితి: సీఎం

HYDలోని రవీంద్రభారతిలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యమిచ్చే విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని, గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యాశాఖలో చివరి నుంచి పోటీపడే పరిస్థితికి తెలంగాణ దిగజారిందని, విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం, అవమానకరమన్నారు.
News March 12, 2025
గచ్చిబౌలి: రేపు హెచ్సీయూలో ప్రత్యేక సదస్సు

హెచ్సీయూ, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు మ.3 గంటలకు HCU క్యాంపస్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆడిటోరియంలో ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. HCU వీసీ ప్రొ.బీజేరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో ముఖ్యవక్తగా డెన్మార్క్లోని ఆర్హస్ యూని వర్సిటీ ప్రొ. సురేశ్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
News March 12, 2025
ఓయూ: PHD ఎంట్రెన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఓయూ కేటగిరి-2 పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 11తో గడువు ముగియగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీని రూ.2,000 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.