News December 19, 2024

HYD: వాయిదా ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్న KTR

image

రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహయం, రుణమాఫీ, పంటలకు బోనస్ రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని KTR తెలిపారు. ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా రైతులకు ఈ యాసంగికి వానకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని, అన్ని పంటలకు బోనస్ వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ వాయిదా ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు.

Similar News

News April 16, 2026

RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

image

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News April 16, 2026

RR: మండుతున్న ఎండలు.. ఇవి తప్పనిసరి

image

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీంతో డీ హైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి తెలిపారు. సాధ్యమైనంత వరకు మ.12 గం. నుంచి 4 వరకు బయట తిరగక పోవడమే ఉత్తమమని, అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT