News April 5, 2024
HYD: విచిత్రం.. చనిపోయిన టీచర్కు నోటీసులు
చనిపోయిన టీచర్కు నోటీసులు పంపిన విచిత్ర ఘటన ఇది. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ ZPHSలో N.గీత స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా విధులు నిర్వహించారు. 2020లో ఆమె బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకొన్నారు. కానీ, దురదృష్టవశాత్తు క్యాన్సర్తో పోరాడి 2023, మే నెలలో చనిపోయారు. ఇది గుర్తించని విద్యాశాఖ అధికారులు 10వ తరగతి పేపర్లు దిద్దేందుకు రాలేదని షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇది చర్చనీయాంశమైంది.
Similar News
News October 7, 2024
లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News October 7, 2024
HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.
News October 7, 2024
HYD: విషాదం.. లిఫ్ట్ అడిగి ప్రాణం కోల్పోయాడు..!
HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో ఈరోజు <<14293025>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్గా పని చేస్తున్న షేక్ మదినా పాషా (42) ఈరోజు ఉదయం TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రవణ్ (38) అనే వ్యక్తి అతడిని లిఫ్ట్ అడిగాడు. అతడిని బైక్ ఎక్కించుకుని కలిసి వెళ్తుండగా లారీ వారి బైక్ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.