News February 24, 2025
HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.
Similar News
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.
News November 12, 2025
కమిషన్తో ఎంత ముట్టిందంటూ ధర్మారెడ్డిని ప్రశ్నించిన సిట్.?

తిరుమల నెయ్యి టెండర్ విషయంలో అనేక ప్రశ్నలను సిట్ అధికారులు <<18263363>>ధర్మారెడ్డి<<>>పై సంధించారు. టెండర్ ప్రక్రియలో ఉండాల్సిన నియమాలను ఎందుకు మార్చారని సూటిగా ప్రశ్నించారట. “మిల్క్” అనే పదాన్ని 2020 FEBలో టెండర్ రూల్స్లో తొలగించి 2023 NOVలో ఎందుకు చేర్చారని సిట్ ఆరా తీసింది. కమిషన్స్ ద్వారా ఎంత ముట్టింది, ఒక్కో ట్యాంకర్కు ఎంత కమిషన్స్ అందింది అని అడిగినట్లు సమాచారం. వీటిని ధర్మారెడ్డి తోసిపుచ్చారట.
News November 12, 2025
మంచిర్యాల: ఈనెల 16న రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీలు

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సేవ భవన్లో ఈనెల 16న తెలంగాణ రాష్ట్ర స్థాయి ‘ఓపెన్ టూ ఆల్’ కరాటే, కుంగ్ఫూ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పోచంపల్లి వెంకటేష్, పెద్దపల్లి మహేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ధ్రువపత్రాలతో సకాలంలో హాజరుకావాలని వారు కోరారు. రాష్ట్రస్థాయి పోరాట పటిమను ప్రదర్శించేందుకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలన్నారు.


