News February 24, 2025

HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

image

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.

Similar News

News November 28, 2025

సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

image

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.

News November 28, 2025

మాజీ నక్సలైట్ సిద్ధన్న హత్య ఘటనాస్థలి పరిశీలించిన ఎస్పీ

image

పీపుల్స్ వార్ గ్రూపు మాజీ నక్సలైట్ సిద్దన్న అలియాస్ బల్లెపు నరసయ్య హత్యకు గురైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం పరిశీలించారు. జగిత్యాలకు చెందిన జక్కుల సంతోష్ అనే వ్యక్తి యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం అని నమ్మించి సిద్ధన్నను అగ్రహారం గుట్టల్లోకి రప్పించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వేములవాడ పోలీసులకు పలు సూచనలు చేశారు.

News November 28, 2025

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

image

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్‌లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.