News February 24, 2025

HYD: ‘విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ’

image

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొ.వెంకటదాస్ చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డీఏటీఏ ఆవిర్భవించడం ఆనందాయకమన్నారు. యుటీసీ, ఏఐసీటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలను పాటించకుండా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.

Similar News

News November 15, 2025

రేడియో కాలర్ టెక్నాలజీతో ఏనుగుల దాడులకు చెక్.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల <<18272761 >>దాడుల<<>> అడ్డుకట్టకు అధికారులు రేడియో కాలర్ టెక్నాలజీని వాడనున్నారు. అందులో అమర్చే GPS టెక్నాలజీ ద్వారా ఏనుగుల కదలికలను రియల్ టైమ్‌లో గుర్తించే వీలు ఉంటుంది. గుంపులోని ఒక ఏనుగకు ఈ రేడియె కాలర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా అవి గ్రామాల వైపు మళ్లినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. దీని ద్వారా మనుషుల, ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించే అవకాశం ఉందని ఇటీవల Dy.CM పవన్ సూచించారు.

News November 15, 2025

సూర్యాపేటలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

దురాజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివ్వెంల పోలీసులు, రహదారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

News November 15, 2025

జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

image

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.