News October 22, 2024

HYD: విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌‌లో ల్యాండింగ్

image

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత అధికారులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు విమానంలో సోదాలు చేశాయి. చివరకు ఫేక్ కాల్ అని తేలడంతో‌ ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Similar News

News October 18, 2025

HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

image

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

News October 17, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈరోజు 21 నామినేషన్లు

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజు 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 12 మంది వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలయ్యాయి. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు వచ్చాయి.

News October 17, 2025

బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.