News February 4, 2025

HYD: విషప్రచారం చేసిన రేవంత్ రెడ్డి: BRS

image

CM రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై విషప్రచారం చేశారని BRS పార్టీ పేర్కొంది. ‘కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకూ పనికిరాదంటూ విషప్రచారాలు చేసిన రేవంత్ & కో.. నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. మరి నువ్వు పనికిరాదన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి రేవంతూ? ఇప్పటికైనా.. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కల్పతరువు కాళేశ్వరమే’ అంటూ ట్వీట్ చేసింది.

Similar News

News December 4, 2025

రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్‌

image

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్‌మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

News December 4, 2025

Party Time: గ్రామాల్లో జోరుగా దావతులు

image

పంచాయతీ ఎన్నికల పుణ్యమాని గ్రామాల్లో దావతులు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను గ్రూపుల వారీగా విభజించి మద్యం, స్టఫ్ సమకూరుస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రూపులకు దావత్ ఏర్పాటు చేయాల్సి రావడంతో అభ్యర్థుల చేతి చమురు భారీగానే వదులుతోంది.

News December 4, 2025

విశాఖ: క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

image

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా క‌రుణ‌కుమారికి ప్ర‌త్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా క‌లెక్ట‌ర్ రూ.లక్ష చెక్ అందజేశారు