News February 4, 2025
HYD: విషప్రచారం చేసిన రేవంత్ రెడ్డి: BRS
CM రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై విషప్రచారం చేశారని BRS పార్టీ పేర్కొంది. ‘కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకూ పనికిరాదంటూ విషప్రచారాలు చేసిన రేవంత్ & కో.. నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్కు 20టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. మరి నువ్వు పనికిరాదన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి రేవంతూ? ఇప్పటికైనా.. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కల్పతరువు కాళేశ్వరమే’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక
ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.
News February 4, 2025
వరంగల్ : మేడ్చల్లో రోడ్డుప్రమాదం.. యువ డాక్టర్ మృతి
మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ చుక్క శ్రీచరణ్ ఈరోజు మృతిచెందారు. గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్ కుమారుడైన శ్రీచరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త తెలియగానే మహబూబాబాద్ మాజీ ఎంపి, BRS జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయసులోనే మృతిచెందడంతో విషాదం నెలకొంది.
News February 4, 2025
జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అనుమతులు తీసుకొని ఈవెంట్ నిర్వహించడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలని కోరింది. అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.