News March 20, 2024

HYD: విషాదం.. ఇద్దరి ప్రాణం తీసిన చేపల వేట..!

image

హైదరాబాద్‌ శివారులో బుధవారం విషాదఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 16, 2025

HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

image

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.

News April 16, 2025

5 నిమిషాల్లో HYD జిల్లా చుట్టేయండిలా!

image

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.

News April 15, 2025

ఉస్మానియా యూనివర్సిటీ PhD పరీక్షల తేదీలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే PhD పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు జరగనున్నాయని, 3 రోజుల్లో రోజుకి మూడు సెషన్స్‌లలో సబ్జెక్టుల వారిగా తేదీలను ఇప్పటికే వర్సిటీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://www.ouadmissions.comలో తమ పరీక్ష తేదీని తెలుసుకోవచ్చని తెలిపింది.

error: Content is protected !!