News October 7, 2024
HYD: విషాదం.. లిఫ్ట్ అడిగి ప్రాణం కోల్పోయాడు..!

HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో ఈరోజు <<14293025>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్గా పని చేస్తున్న షేక్ మదినా పాషా (42) ఈరోజు ఉదయం TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రవణ్ (38) అనే వ్యక్తి అతడిని లిఫ్ట్ అడిగాడు. అతడిని బైక్ ఎక్కించుకుని కలిసి వెళ్తుండగా లారీ వారి బైక్ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
Similar News
News October 23, 2025
రాజేంద్రనగర్లోని NIRDPRలో ఉద్యోగాలు

రాజేంద్రనగర్లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT
News October 23, 2025
పోచారం కాల్పులు.. రౌడీషీటర్ ఇబ్రహీం అరెస్ట్

పోచారం కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. CP సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. తరచూ తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇబ్రహీం, అతడి స్నేహితులు సోను మర్డర్కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నిన్న <<18078700>>యంనంపేట్<<>>లోని కిట్టి స్టీల్ వద్ద అతడిపై కాల్పులు జరిపారు.
News October 23, 2025
BREAKING: జూబ్లీహిల్స్లో 130 మంది అభ్యర్థులు రిజెక్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. పలు కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. 81 మంది నామినేషన్లను మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో 186 సెట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం గమనార్హం. రేపు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఉంది.