News July 25, 2024
HYD: వీధి కుక్కల సమస్యా.. ఫోన్ చేయండి
వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 25, 2024
HYD: నిండుకుండలా హుస్సేన్సాగర్
నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. ట్యాంక్బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్కు వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.
News September 24, 2024
విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP
రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.
News September 24, 2024
HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే
కేంద్రమంత్రి నితీన్గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.