News April 5, 2025
HYD: వెదర్ అప్డేట్స్ ఇచ్చేది ఈయనే..!

HYD సహా తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించి క్షణ క్షణం సోషల్ మీడియా వేదికగా కూకట్పల్లి JNTUH విద్యార్థి బాలాజీ వెదర్ అప్డేట్స్ అందిస్తుంటారు. బాలాజీ అప్డేట్స్ కచ్చితత్వంతో కూడుకున్నవిగా ప్రజలు నమ్ముతున్నారు. శుక్రవారం JNTUH యూనివర్సిటీ VC కిషెన్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయనను అభినందించారు. తనను అభినందించడం ఎంతో ఆనందంగా ఉందని, అప్డేట్స్ అందిస్తూనే ఉంటానని తెలిపారు.
Similar News
News April 7, 2025
కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.
News April 7, 2025
ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.
News April 7, 2025
ఒంటిమిట్ట: అధికారులకు మంత్రుల దిశానిర్దేశం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన మందిరంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.