News November 11, 2024
HYD: శంషాబాద్కు అఘోరీ

శంషాబాద్లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి ప్రకటించారు. ఏపీ గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె ఆదివారం మాట్లాడారు. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారైంది. ఈనెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని రాజ్ భవన్కు వెళతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం పుట్టపర్తికి వెళతారు.
News November 16, 2025
HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.
News November 16, 2025
రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు.


