News June 23, 2024
HYD: శంషాబాద్లో దారుణం

శంషాబాద్లో దారుణ ఘటన జరిగింది. RGIA పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్కు చెందిన దంపతులు కూలీలు. వారికి కూతురు ఉంది. ఈక్రమంలో అనారోగ్యంతో భర్త 2నెలల క్రితం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య ఇటీవల పనుల కోసం బయటకు వెళ్లగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. అదే రోజు వరుసకు చిన్నాన్న అయ్యే యాకేశ్ ఇంట్లోకి వెళ్లి బాలిక(14)ను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.
News November 12, 2025
జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు వారాల పాటు ప్రధాన పార్టీలు ఫుల్ జోష్గా ప్రచారం చేశాయి. సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల కీలక నేతల రోడ్ షోలు,ర్యాలీలు, డైలాగ్లు,మాటల తూటాలు, ఆరోపణలతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ వేడెక్కాయి. అయితే ఇంత చేసినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో అటు పార్టీలతోపాటు ఇటు ఎన్నికల అధికారులు వెనకబడ్డారు. 48.49% పోలింగ్ జరిగింది.
News November 12, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.


