News March 28, 2025

HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

image

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

HYD: నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు ఇదే..!

image

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ NFC నగర్‌లో కవి అందెశ్రీ నిర్మించుకుంటున్న ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. 348 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న G+3 భవనం నిర్మాణ దశలో ఉంది. ఇల్లు నిర్మించే స్థోమత లేక లాలాపేటలోని ఇరుకు ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌ ఆర్థిక సహాయం చేయడంతో గృహ నిర్మాణం ప్రారంభమైంది. పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కలల సౌధం పూర్తికాకముందే అందెశ్రీ కాలం చేశారు.

News November 11, 2025

HYD: “ఏ బాబు లెవ్”.. ఓటెయ్!

image

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.02 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఓటర్లు ఇకనైనా మేల్కొనాలని SMలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఏ బాబు లెవ్.. ఓటెయ్’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలవు ఉంటే నగరవాసులు కాస్త ఆలస్యంగానే లేస్తారని ఓ అధికారి సైతం గుర్తుచేశారు. కానీ, మరీ ఆలస్యం అయ్యింది. ఇకనైనా మేల్కొండి. ఓటింగ్‌ పర్సంటేజ్‌ను పెంచండి.
SHARE IT

News November 11, 2025

జూబ్లీబైపోల్: 9:30 గంటలకు Voter Turnout

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ తెలిపారు. పలుచోట్ల EVM యంత్రాలు మొరాయిస్తుండగా చర్యలు చేపట్టి, పునరుద్ధరించారు. ఫస్ట్ ఓటర్ టర్న్ అవుట్ ఉదయం 9:30 గంటలకు అందుబాటులో ఉంటుందని ECVT టీం తెలిపింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఓటు వేశారు? పర్సంటేజ్ ఎంత? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.