News April 28, 2024

HYD శివారులో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది

image

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో‌ చిరుతపులి సంచారంతో‌ అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వే‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాల‌ను బిగించారు.

Similar News

News November 13, 2025

HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.

News November 13, 2025

OU: బీఈ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News November 13, 2025

HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

image

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.