News August 5, 2024
HYD: షాద్నగర్ ఘటనపై సీఎం సీరియస్

బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
Similar News
News December 3, 2025
GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.
News December 3, 2025
GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.
News December 3, 2025
GHMCలో పురపాలికల విలీనంపై ప్రొసీడింగ్స్

ORR వరకు 27 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి GHMC కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పురపాలక సంఘాల రికార్డుల పరిశీలన కోసం GHMC డిప్యూటీ కమిషనర్లు, మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్లను నియమించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పురపాలిక అకౌంటు బ్యాలెన్స్ సైతం GHMC అకౌంట్కు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొన్నారు.


