News August 5, 2024
HYD: షాద్నగర్ ఘటనపై సీఎం సీరియస్

బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
Similar News
News December 17, 2025
హైదరాబాద్లో BJPకి అగ్ని పరీక్ష!

GHMC ఎన్నికల రణరంగంలో BJP ఉనికి ఇప్పుడు ఒక అగ్నిపరీక్షగా మారింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను విస్మరించడం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. నాయకత్వ లేమి, అగ్ర నేతల వర్గపోరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నిర్వీర్యం చేశాయి. 300 కొత్త వార్డుల పునర్విభజన అనే వ్యూహాత్మక చక్రబంధాన్ని ఎదుర్కోవడంలో BJP వెనుకబడింది. తక్షణమే ప్రజా సమస్యలపై పోరాటమే కమలానికి ఏకైక మార్గం.
News December 17, 2025
HYDలో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త!

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 17, 2025
HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్స్టా-కేఫ్ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.


