News August 20, 2024
HYD: ‘సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహమే సరైంది’

రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
Similar News
News November 22, 2025
HYD: పైలట్పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT


