News January 23, 2025
HYD: సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు

తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు విధించారు. ఇకపై సచివాలయం లోపలికి వెళ్లే వారికి ఇచ్చే పాస్తో ఒక్కరినే అనుమతించనున్నారు. గతంలో విజిటర్స్ సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే 6వ అంతస్తులోకి విజిటర్స్ అనుమతి నిరాకరించారు. మంగళవారం సీఎస్ ఫ్లోర్లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో ఎస్పీఎఫ్ సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడప కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన చిన్న సుంకిరెడ్డికి ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైలు అధికారులు వెల్లడించారు.
News November 13, 2025
పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

విశాఖలో CII సుమ్మిట్లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<


