News March 7, 2025
HYD: సన్రైజర్స్ అభిమానులకు శుభవార్త

ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులో ఉంటాయని సన్రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఇవాళ ఉ.11 నుంచి ప్రారంభంకానుంది.
Similar News
News October 24, 2025
HYD: మూసీ వారధి ఇక సెలవంటోంది! ❣

హైదరాబాదీతో ఆ బంధం తెగుతోంది. 40 ఏళ్లు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చిన మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేతతో ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉన్నప్పుడు తెలియదేమో కానీ.. కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలైనప్పటి నుంచి వాహనదారులకు ఆ కష్టాలు తెలుసు. ఊరంతా తిరిగివెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పాతబ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బాగు చేసే అవకాశం కూడా లేక బల్దియా <<18080133>>కూల్చివేతలు<<>> చేపట్టింది.
News October 24, 2025
ఓయూలో ఫలితాల విడుదల

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
SHARE IT
News October 24, 2025
HYD: రామంతాపూర్లో బెట్టింగ్లకు బలైన డిగ్రీ విద్యార్థి

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


