News January 28, 2025

HYD: సమస్య పరిష్కారం కాకుంటే రంగంలోకి దిగుతా: రంగనాథ్

image

నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసేందుకు ప్రజలు హాజరయ్యారని, ఆయా ఫిర్యాదులకు సంబంధించిన రెండు వారాల్లో అధికారులు ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి విచారణ చేపడతారన్నారు. 78 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయని తెలిపారు.

Similar News

News November 23, 2025

శ్రీకాకుళం: ఘోర ప్రమాదం..నలుగురు మృతి

image

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62), డెడ్ బాడీలు కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.

News November 23, 2025

MNCL: కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్

image

డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ శుక్రవారం భోజనం చేస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్‌ నాయక్‌ను అరెస్ట్ చేశారు.

News November 23, 2025

నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

image

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.