News April 9, 2025
HYD: సమ్మర్ స్పెషల్.. యాత్రలకు స్పెషల్ ప్యాకేజీ!

SCR అధికారులు ‘భారత్ గౌరవ్’ వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. ప్యాకేజీ-1 కింద హరిద్వార్- రిషికేష్- వైష్ణోదేవి యాత్రకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. టిక్కెట్ ధర రూ.18,510 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. HYD నగర వాసులు సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 23, 2026
పద్మనాభ రెడ్డి గారు.. కాపుల జోలికి రావొద్దు: సానా సతీశ్

YCP నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ MP సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మగౌరవాన్ని వినియోగించుకోవద్దని సతీశ్ సూచించారు.
News February 23, 2026
‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.
News February 23, 2026
NZB: మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన సీపీ

4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మెడల్స్ సాధించిన NZB సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీపీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.


