News June 29, 2024
HYD: సాయి చంద్ చిత్రపటానికి కేటీఆర్, హరీశ్ నివాళి

HYD నగరం హస్తినాపురంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక కుటుంబ మనిషిలా ఉండేవాడని హరీష్ రావు, తన ఆట, పాట మరువలేమని KTR అన్నారు.
Similar News
News November 21, 2025
Skill Trainingలో సిటీ పోలీస్ బాస్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా పేట్ల బురుజు, చేలపురా సిటీసీ శిక్షణా కేంద్రాలను సందర్శించారు. హోంగార్డు నుంచి ఎస్సై స్థాయి వరకు 350 మంది సిబ్బంది తీసుకుంటున్న శిక్షణను పరిశీలించారు. “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి తెలుసుకున్నారు. ట్రైనింగ్ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 21, 2025
IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్లు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.


