News March 10, 2025

HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

image

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.

Similar News

News April 11, 2026

‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

image

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.

News April 11, 2026

ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

image

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.