News June 18, 2024

HYD: సీతారాముల విగ్రహాల ధ్వంసంపై RSS, VHP, బజరంగ్‌దళ్ ఆందోళన

image

మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న సీతారాముల ఆలయంలో దుండగులు<<13461450>> విగ్రహాలను ధ్వంసం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న RSS, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 20, 2025

జీహెచ్‌ఎంసీ వర్సెస్ సీజీజీ.. డేటా బదిలీపై ప్రతిష్టంభన

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల ఆస్తి పన్ను డేటా బదిలీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. CGG నుంచి వివరాలు అందకపోవడంతో పన్ను వసూళ్లకు బ్రేక్ పడింది. బల్దియా వెబ్‌సైట్‌లో కొత్త పోర్టల్ సిద్ధం చేసినా, అసలు డేటా లేకపోవడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విభాగాల మధ్య సమన్వయ లోపంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ‘డేటా చిక్కుముడి’ని విడదీయాలని కోరుతున్నారు.

News December 20, 2025

HYD ‘నైట్ లైఫ్’.. కాగితాలకే పరిమితమైన మెట్రో వేళలు

image

‘నైట్ ఎకానమీ’లో భాగంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. విజన్-2047 లక్ష్యాల్లో వీటిని చేర్చినప్పటికీ మెట్రో రైళ్లు రాత్రి 11 గంటలకే నిలిచిపోతున్నాయి. అర్ధరాత్రి ప్రయాణాలపై ఇప్పటివరకు ఎలాంటి జీవో వెలువడలేదు. వెబ్‌సైట్‌లోనూ పాత వేళలే ఉండటంతో, సామాన్యులకు ‘మిడ్‌నైట్ మెట్రో’ ప్రయాణం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

News December 20, 2025

GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

image

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్‌లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.