News April 10, 2025
HYD: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిసిన BRS బృందం

HCU కంచ గచ్చిబౌలి అటవీ భూములలో అక్రమంగా చెట్ల కొట్టివేతకు సంబంధించి 200 పేజీల నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ బృందం కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వంలో CECని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్ కలిశారు. తెలంగాణ భవన్లో BRS బృందం మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.
News November 12, 2025
ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్

AP: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత 16 నెలల్లో $120B పెట్టుబడులు వచ్చాయి. 5 ఏళ్లలో 20L ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. పెట్టుబడిదారులు APని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని CII సమ్మిట్పై నిర్వహించిన ప్రెస్మీట్లో వివరించారు.
News November 12, 2025
యాదాద్రి: రేపు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు

ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు కార్యాలయానికి రావద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.


