News April 10, 2025
HYD: సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిసిన BRS బృందం

HCU కంచ గచ్చిబౌలి అటవీ భూములలో అక్రమంగా చెట్ల కొట్టివేతకు సంబంధించి 200 పేజీల నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని బీఆర్ఎస్ బృందం కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వంలో CECని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవి చంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్ కలిశారు. తెలంగాణ భవన్లో BRS బృందం మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News November 20, 2025
ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.
News November 20, 2025
HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
News November 20, 2025
కరీంనగర్: డయల్ 100కు 47,481 కాల్స్

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ‘విజిబుల్ పోలీసింగ్ సిస్టం’ పకడ్బందీగా అమలవుతోంది. డయల్ 100 ద్వారా ఈ మధ్య కాలంలో 47,481 కాల్స్ రాగా, అందులో 2,547 ప్రమాదాలు, 493 ఆత్మహత్యాయత్నాలు, 5,961 మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఉన్నాయి. దీంతో ఘటన ఏదైనా డయల్ 100కు కాల్ చేయాలన్న చైతన్యం ప్రజల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.


